Subscribe For Newsletter
24 Dec 2019
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోత్కూర్ కు చెందిన MD. అయాజ్ ను నియమిస్తూ రాష్ట్ర మైనారిటీ విభాగం చైర్మన్ అబ్దుల్ సోహెల్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో అయాజ్ INTUC యువజన విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు యువజన కాంగ్రెస్ NSUI లో పని చేసిన తనకు ఈ పదవి రావడం కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు లభించిందని తెలిపారు. MD అయాజ్ మాట్లాడుతూ తన పదవికి సహకరించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం కన్వీనర్ నాగర్ గారి ప్రీతం కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటానని జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో లో NSUI యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రవీణ్ బాబర్ నిమ్మల శ్రీను ఎండి ఖాజా భాష పాల్గొన్నారు
Latest News