Subscribe For Newsletter

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : నాగరిగారి ప్రీతం

 10 Apr 2020

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : నాగరిగారి ప్రీతం
పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు పడి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఎకరానికి యాభైవేలు ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ నాగరిగారి ప్రీతం డిమాండ్ చేసారు. ముందే కరోనా కారణంగా పరోక్షంగా నష్టపోయిన రైతులు ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్లనే ప్రత్యక్షంగా నష్టపోయారని వారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గింజ మరియు ప్రతి పంట ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ ముఖ్యంగా వర్షాల ద్వారా నష్టపోయిన రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని వారు కొరారు . ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ లో కరోనా లేనప్పుడు ఎన్నో రైతు ఆత్మహత్యలు జరిగాయని ఇప్పుడు పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని అన్నారు. కరోనా చావులు అరికట్టే సమయంలోనే ఆకలి చెవులను మరియు రైతు ఆత్మహత్యలను అరికట్టాలని ప్రీతమ్ అన్నారు.